డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోగ్’ (2017) చిత్రంతో టాలీవుడ్కు హీరోగా పరిచయమయ్యాడు ఇషాన్. మొదటి సినిమాతోనే అటు నటనపరంగానూ, ఇటు పర్సనాలిటీ పరంగానూ ఆకట్టుకున్నాడు ఇషాన్. కాగా… స్వల్ప విరామం తరువాత ఈ యంగ్ హీరో టాలీవుడ్లో మరోసారి సందడి చేయనున్నాడు. అయితే.. ఈ సారి హీరోగా కాదు.. విలన్గా అట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ పేరుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే ఇషాన్కు విలన్గా నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం.
ఒకవేళ ఇది నిజమైతే… ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
, ఇడియట్
, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
చిత్రాలతో పూరీకి కలిసొచ్చిన హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ సినిమాలో… పూరీ పరిచయం చేసిన హీరో ఇషాన్ విలన్గా నటించడం ఆసక్తికరమైన విషయమనే చెప్పాలి. ఏదేమైనా… మహా సముద్రం
ప్రాజెక్ట్పై, ఇషాన్ ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ రానుంది.
[subscribe]
[youtube_video videoid=JADouytbGs8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: