సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా… బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం… నైజాంలో లాభాల బాటలో నడుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తనకి బాగా అచ్చొచ్చిన హైదరాబాద్ ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ థియేటర్స్లో రూ. కోటికి పైగా గ్రాస్ రాబట్టి మరోసారి సత్తా చాటాడు మహేష్. గతంలో ‘శ్రీమంతుడు’తో 11 రోజుల్లో ఈ మొత్తాన్ని రాబట్టగా… ఇప్పుడు ‘మహర్షి’తో 10 రోజుల్లోనే కోటి రూపాయల గ్రాస్ని ఆర్జించి తన గత చిత్రాల రికార్డును తనే అధిగమించాడు.
ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్లో మహేష్ ట్రాక్ రికార్డును ఒకసారి పరిశీలిస్తే… ‘మురారి’(2001)తో ప్రారంభమైన ఈ కోటి రూపాయిల గ్రాస్ ప్రస్థానం… ‘ఒక్కడు’(2003), ‘అతడు’(2005), ‘పోకిరి’(2006), ‘దూకుడు’(2011), ‘శ్రీమంతుడు’(2015), ‘భరత్ అనే నేను’(2018)… ఇలా ఏడు సార్లు సక్సెస్ఫుల్గా సాగింది. ఈ నేపథ్యంలో… ‘మహర్షి’తో ఎనిమిదో సారి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నాడు మహేష్. దీంతో… టాలీవుడ్లో మరే హీరోకి సాధ్యం కాని ఓ స్పెషల్ ట్రాక్ రికార్డును మహేష్ సొంతం అయినట్లయ్యిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా… ‘మహర్షి’ కంటే ముందు… ‘బాహుబలి 2 ది కంక్లూజన్’ 4 రోజుల్లోనూ, ‘బాహుబలి’, ‘రంగస్థలం’ 9 రోజుల్లోనూ కోటి రూపాయిల గ్రాస్ని ఆర్జించి ముందంజలో ఉన్నాయి. అలాగే… ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ చరిత్రలో కోటి రూపాయిల గ్రాస్ను రాబట్టిన హీరోలలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్… నాలుగేసి చిత్రాలతో ఈ ఏరియాలో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
[subscribe]
[youtube_video videoid=HzgATNv7JMc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: