యాక్షన్ మూవీస్కి కేరాఫ్ అడ్రస్గా నిలచిన హీరోలలో గోపీచంద్ ఒకడు. ప్రస్తుతం గోపీచంద్ కథానాయకుడిగా ఓ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతోంది. తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్… ఇప్పటికే రాజస్థాన్లో తొలి షెడ్యూల్ను జరుపుకుంది. ఇందులో భాగంగానే కొన్ని యాక్షన్ సీన్స్ను కూడా తెరకెక్కించారు. అయితే… గోపీచంద్ అనూహ్యంగా గాయపడిన కారణంగా చిత్రీకరణకు స్వల్ప విరామం ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… తాజాగా గోపీచంద్ గాయం నుంచి కోలుకోవడంతో… జూన్ 6 నుంచి తాజా షెడ్యూల్ను ప్రారంభించనున్నట్టు సమాచారం. హైదరాబాద్లో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో కూడా యాక్షన్ సన్నివేశాలనే తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
గోపీచంద్ సరసన మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని… ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=9jOVc1hBOEE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: