సూపర్ స్టార్ రజినీకాంత్, ఏస్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘దర్బార్’. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో రజినీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కనిపించనున్నాడు. తాజాగా ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేసుకుందీ చిత్రం. స్వల్ప విరామం తీసుకుని… ఈ నెలాఖరు నుంచి తదుపరి షెడ్యూల్ని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… రజినీ, మురుగదాస్ కు హిందీలోనూ మంచి మార్కెట్ ఉండడం… దానికి తోడు ముంబై నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండంతో… తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ దర్బార్
ని విడుదల చేసే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా.. రజినీ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలను సమకూరుస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=sdz1hyQXEo8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: