‘తాత మనవడు’ నుంచి ‘మా నాన్నకి పెళ్లి’ వరకు మూడు తరాల నేపథ్యంలో సాగే పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు అదే బాటలో మరో సినిమా రాబోతోందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మెగా హీరో సాయితేజ్, యూత్ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ప్రతి రోజూ పండగే’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు టాలీవుడ్ టాక్. కాగా… డిఫరెంట్ కాన్సెప్ట్స్ను ఎంచుకుని వాటికి తన మార్కు ఎంటర్టైన్మెంట్ను జోడించి ఆడియన్స్ను అలరించే మారుతి… ఈ చిత్రంలో మాత్రం ఫ్యామిలీ ఎమోషన్లకు పెద్ద పీట వేస్తున్నట్టు తెలుస్తోంది. తాత, తండ్రి, మనవడు… ఇలా మూడు తరాల మధ్య సాగే కథగా ఈ సినిమాని రూపొందిస్తున్నాడట దర్శకుడు. డబ్బుకి తప్ప ప్రేమాభిమానాలకు విలువివ్వని ఓ తండ్రిని… ఓ కొడుకు ఎలా మార్చాడన్నదే ఈ సినిమా కథ అని టాక్. ఈ చిత్రంలో విలక్షణ నటుడు రావు రమేష్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే… స్క్రిప్టు పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం… వచ్చే వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని వినికిడి. కాగా… గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: