వయసులో తనకంటే పెద్దదైన అమ్మాయిని ప్రేమించే యువకుడి కథతో ఆ మధ్య ‘ఆరోప్రాణం’ (1997) (వినీత్, సౌందర్య) వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్తో మరో చిత్రం రానుందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా… ఐదేళ్ళ విరామం తర్వాత ఇప్పుడు మరో ప్రేమకథను రూపొందించనున్నాడట. అంతేకాదు… ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్, యువ కథానాయకుడు రాజ్ తరుణ్ జంటగా నటించనున్నారని తెలుస్తోంది. వయసులో తనకంటే పెద్దదైన ఓ అమ్మాయిని ఇష్టపడే అబ్బాయి కథగా ఈ సినిమా ఉండబోతోందని వినికిడి. మరి రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘ఆరోప్రాణం’ స్టోరీ లైన్తో రానున్న ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
కాగా… కె.కె.రాధామోహన్ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది.
[subscribe]
[youtube_video videoid=Yk8jc0uJgjk ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: