టాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోలు ఉన్నా.. వారెవ్వరికీ దక్కని అరుదైన అవార్డ్ అల్లు వారబ్బాయి శిరీష్ కు దక్కింది. ఇంతకీ ఆ అవార్డ్ ఏంటనుకుంటున్నారా?.. ‘క్రాసోవర్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఆయనకు దక్కింది. అది కూడా కేరళలో. మోహన్లాల్తో కలిసి ‘1971’ చిత్రంలో నటించినందుకు గానూ, అల్లు శిరీష్ను ఈ అవార్డు వరించింది. కేరళలోని కొచ్చిలో జరుగుతున్న లులు ఫ్యాషన్ వీక్లో ‘క్రాసోవర్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ఆయన అందుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు శిరీష్ కావడం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సంజీవ్రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ నటించిన ‘ఏబీసీడీ’(అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. మే 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు.
మరి మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో హిట్టయిన ఈ సినిమా తెలుగులో హిట్ అవుతుందో? లేదో? ఈ సినిమాతో అయినా అల్లు శిరిష్ కు హిట్ దక్కుతుందో?లేదో? చూద్దాం…
[subscribe]
[youtube_video videoid=nJ9CdpScF_s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: