ఎట్టకేలకు సాయి తేజ్ కు చిత్రలహరి సినిమాతో పెద్ద రిలీఫే దొరికింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఫ్లాప్ లతో సతమతమవుతున్న ఈ యంగ్ హీరోకు ఈసారి మాత్రం హిట్ తప్పనిసరైంది. అలాంటి పరిస్థితుల్లో తన ఆశలన్నీ చిత్రలహరి సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక తన అంచనాలను నిజం చేస్తూ మంచి టాక్ నే సంపాదించుకుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ద్వారా సాయి తేజ్ తన పేరును కూడా మార్చుకున్న సంగతి తెలిసిందే. సాయి థరమ్ తేజ్ గా ఉన్న పేరును సాయి తేజ్ గా మార్చకున్నాడు. అంతేకాదు పేరు మార్చుకోవడం కూడా తేజ్ కు కలిసొచ్చిందంటున్నారు. అయితే ఈ పేరు మార్చుకునే ఐడియా తేజ్ కు డైరెక్టర్ మారుతినే ఇచ్చాడట. అది కాస్త వర్కవుట్ అవ్వడంతో ఇక నుంచి సాయితేజ్ పేరుతోనే కొనసాగాలని ఆయన ఫిక్స్ అయ్యాడట.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం… సాయితేజ్ తదుపరి సినిమా మారుతి దర్శకత్వంలోనే ఉండబోతుందన్నట్టు తెలుస్తోంది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ తరువాత మారుతి ఒక మంచి కథను సిద్ధం చేసుకున్నాడట. ఆ కథను సాయితేజ్ తో చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా వుండనుందని చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=QvSP5gJkKg0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: