వైవిధ్యభరితమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న యువ కథానాయకుడు నిఖిల్… మరో భిన్నమైన కథతో ‘అర్జున్ సురవరం’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహించాడు. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఈ సినిమా పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే… మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా… ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను చాలా గ్రాండ్గా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో భాగంగానే… ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి కూడా నిర్మాత ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు చిరు పాజిటివ్గా స్పందించడం… అలాగే ఈ చిత్ర నిర్మాత ‘ఠాగూర్’ మధు, చిరుల మధ్య సత్సంబంధాలు ఉండడంతో చిరు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే… చిరు రాక పై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
[subscribe]
[youtube_video videoid=XmEiA5Z9n6M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: