హరినాథ్ బాబు దర్శకత్వంలో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ద్వారా పరిచయమైన సుధాకర్ హీరోగా .. నిత్య ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘నువ్వు తోపురా’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రభాస్ చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ ను చూస్తే.. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్, యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మే 3వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
కాగా యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డీ శ్రీకాంత్ నిర్మించిన ఈసినిమాలో 90 దశకాల్లో యువతను ఆకట్టుకొన్న హీరోయిన్ నిరోషా ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్సింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో సావిత్రి అనే ఓ కీలకమైన పాత్రలో నిరోషా కనిపిస్తారని తెలుస్తోంది. చూద్దాం మరి ఈ సినిమా అటు సుధాకర్ కు ఇటు నిరోషాకు ఎలా కలిసొస్తుందో.
[subscribe]
[youtube_video videoid=iGJYp4WjQP0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: