‘హలో’ చిత్రంతో టాలీవుడ్కు కథానాయికగా పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందివ్వకపోయినా… నటిగా మాత్రం మంచి మార్కులు తెచ్చుకుంది కళ్యాణి. ఇక రెండో ప్రయత్నంగా మెగా హీరో సాయి తేజ్ సరసన ‘చిత్ర లహరి’లో నటించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా హిట్ లిస్ట్లో చేరింది. ప్రస్తుతం శర్వానంద్, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ హీరోయిన్గా నటిస్తోంది ఈ హలో
భామ. మే నెలలో ఈ సినిమా తెరపైకి రానుంది. ఈ లోపే మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ అమ్మడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో నితిన్కు జోడీగా రష్మిక మందన్నను ఎంపిక చేసింది చిత్ర బృందం. అలాగే… కథానుసారం మరో హీరోయిన్కు కూడా స్థానం ఉండడంతో… ఆ పాత్ర కోసం కళ్యాణి ప్రియదర్శన్ను సంప్రదించిందట చిత్ర యూనిట్. తన పాత్ర నచ్చడంతో కళ్యాణి కూడా వెంటనే ఓకే చేసిందని సమాచారం. త్వరలోనే కళ్యాణి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
[subscribe]
[youtube_video videoid=z6KOmkwGaO4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: