మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలసి మెగా బడ్జెట్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్… వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే చరణ్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఐదేళ్ళ క్రితం చరణ్తో ఎవడు
వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి… తాజాగా సదరు మెగా హీరోకి ఓ స్టోరీ లైన్ చెప్పాడట. అది నచ్చడంతో… చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. అంతేకాదు… డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని టాక్. అన్ని అనుకున్నట్లుగా జరిగితే… వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముందని ఇన్ సైడ్ సోర్స్ టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి… ‘ఎవడు’ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=HkCzluLtwLE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: