దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాట్రియోటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు చరణ్ కు జంటగా ఉత్తరాది భామ అలియా భట్ నటించనుంది. ఇక ఎన్టీఆర్ కు జోడిగా బ్రిటిష్ సుందరి డైసీ ఎడ్గార్ జోన్స్ నటించనున్నట్లు ఇది వరకే ప్రకటన చేసింది చిత్ర బృందం. అయితే… ఇప్పుడు ఈ ప్రేస్టేజియస్ ప్రాజెక్ట్ నుంచి బ్రిటిష్ భామ తప్పుకున్న వైనంలో… ఈమె పాత్రలో ఎవరు నటించనున్నారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తారక్ సరసన బాలీవుడ్ భామలు శ్రద్ధా కపూర్, పరిణీతి చోప్రా నటించే అవకాశం ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో… రాజమౌళి నుంచి నిత్య మీనన్ కు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు… స్క్రీన్ టెస్ట్ కోసం నిత్య బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినట్లు కూడా సమాచారం. మరి ఈమె ఎన్టీఆర్ తో రెండో సారి (‘జనతా గ్యారేజ్’ తర్వాత) జత కడుతుందా? లేక సినిమాలో కీలక పాత్ర పోషించనుందా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఎం.ఎం.కీరవాణి స్వరాలను సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే… ఈ సినిమాని 2020, జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=-4zAhT8bHJ4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: