కింగ్ నాగార్జున తో అధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు.. నాగ్, శివ ప్రసాద్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు మ్యూజికల్ హిట్స్ అనిపించుకున్నాయి. వాటిలో 2004లో వచ్చిన ‘నేనున్నాను’ ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగార్జున, శ్రియ, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించారు. స్వరవాణి ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా ‘ఏ శ్వాస లో చేరితే’ పాట శ్రోతలను ఎంతగానో అలరించింది. అటు సంగీతం పరంగానూ, ఇటు సాహిత్యపరంగానూ ఉన్నత స్థాయిలో ఉండి మెప్పించింది.
ఆపదలో ఉన్న ఓ యువతిని ఆదరించి ‘నేనున్నాను’ అంటూ చేయూతనిచ్చి.. ఆమె ఎదుగుదలకు దోహదపడిన ఓ యువకుడి కథ తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో కుటుంబ ప్రేక్షకుల ఆదరణను చూరగొంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
2004 ఏప్రిల్ 7న విడుదలైన ‘నేనున్నాను’… నేటితో 15 వసంతాలను పూర్తి చేసుకుంది.
[youtube_video videoid=c0frjVPcTKc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: