`లై` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది మేఘా ఆకాష్. ఆ తరువాత `ఛల్ మోహన్ రంగ`లోనూ కనువిందు చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ నితిన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. మొదటి రెండు తెలుగు చిత్రాల్లోనూ సోలో హీరోయిన్గా నటించిన మేఘకి… చాన్నాళ్ళ తరువాత తెలుగు పరిశ్రమ నుంచి మరో అవకాశం దక్కిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… యువ కథానాయకుడు రాజ్ తరుణ్తో ప్రముఖ నిర్మాత `దిల్` రాజు ఓ యూత్ఫుల్ ఎంటర్టైనర్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్ళనుంది. కాగా… ఈ చిత్రంలో రాజ్ తరుణ్కి జోడీగా నటించే అవకాశం మేఘా ఆకాష్కి దక్కిందని టాలీవుడ్ టాక్. మరి… గత రెండు సినిమాల్లోనూ సోలో హీరోయిన్గా నటించిన మేఘ… ఈ చిత్రంలోనూ అదే తరహాలో సాగుతుందేమో చూడాలి.
[youtube_video videoid=DDQfiI_oi1Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: