రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ పై ఇప్పుడు మంచి సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటీవల టీడీపీ కి సంబంధించిన ఓ కార్యకర్త ఈసీకి ఫిర్యాదు చేయడం దానిపై స్పందించిన సీఈఓ సినిమా చూడకుండానే ఈసీకి ఆపే రైట్ లేదని అనడంతో ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు ఉన్న ఒక అడ్డు తొలగినట్టే అనుకున్నారు. అయితే అసలైన సమస్య సెన్సార్ బోర్డ్ నుండి ఎదుర్కోవాల్సి ఉంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సెన్సార్ సర్టిఫికేట్ కోసం సినిమాను సన్సార్ కు పంపగా.. తొలి దశ ఎన్నికలు పూర్తయ్యేవరకు సినిమాని పరిశీలించడం సాధ్యం కాదని సెన్సార్ బోర్డ్ లేఖ పంపడంతో.. దానిపై స్పందించిన వర్మ… ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డు ప్రయత్నిస్తోందని…ఎన్నికల కోడ్ పేరిట సినిమా సెన్సార్ స్క్రీనింగ్ని వాయిదా వేసే అధికారం సెన్సార్ బోర్డుకి లేదు.. ఇదంతా మరొకరి ప్రయోజనం కోసమే చేస్తుందని వర్మ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ల బాణాలు వదిలారు. అంతేకాదు.. ఈ విషయమై కోర్టుకు కూడా వెళతానని చెప్పి.. ఈ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నట్టు తెలిపారు.
అయితే ఇంతలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ‘‘సెన్సార్ బోర్డుతో మాకున్న అపార్థాలు తొలగిపోయాయి అంటూ నిన్న రాత్రి ట్వీట్ చేసి అందరికీ షాకిచ్చాడు వర్మ. అంతేకాదు.. సెన్సార్ బోర్డుతో మాకున్న అపార్థాలు తొలగిపోయాయి..సెన్సార్ బోర్డ్ సభ్యులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.. దీంతో ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేస్తున్నామంటూ ట్వీట్ లో తెలిపారు. మరి సెన్సార్ సభ్యులు ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు.. సినిమాలో ఏదైనా మార్పులు చేయమని చెబుతారా? లేదా? అన్నది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=eZNZjmZ_sUA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: