తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా సీత సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా సీత రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు చిత్రయూనిట్. ఏప్రిల్ 25 వే తేదీన సీత సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు ఓ రూమర్ మాత్రం చక్కర్లు కొడుతుంది. అదేంటంటే… బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై తేజ అరిచేశాడట. నిజానికి తేజ గురించి కాస్త అనుభవం ఉన్న ఎవరికైనా తెలిసే ఉంటుంది. ఆయన చెప్పినట్టు చేయకపోతే అరిచేస్తాడని.. అవసరమైతే కొట్టేస్తాడన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే రూమర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో కూడా వినిపిస్తుంది. షూటింగ్ లో భాగంగా ఓ సీన్ ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కరెక్ట్ గా…తేజ అనుకున్నట్టు గా చేయలేదని.. అందుకు తేజ ఒక్కసారిగా సాయి పై అరిచేశాడని.. దీంతో సాయి తో పాటు అక్కడ ఉన్న యూనిట్ మొత్తం షాకైందని ఇండస్ట్రీ మొత్తం టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. పలు సైట్లలో కూడా దీని గురించి రాశారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రూమర్ పై స్పందించి అందులో నిజం లేదని… అవన్నీ పుకార్లు మాత్రమే.. షూటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తల్లో నిజం లేదన్న సంగతి తెలిసిపోయింది. స్పందించిన చిత్రయూనిట్ అదేం లేదుని..
కాగా తేజ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను అనిల్ సుంకర, కిషోర్ గరికపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో మన్నారా చోప్రా, సోనూ సూద్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా పలువురు కొత్త వాళ్లు కూడా ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి`లక్ష్మీ కళ్యాణం`, `నేనే రాజు నేనే మంత్రి` తరువాత తేజ – కాజల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఈ సినిమాతో మరోసారి హిట్ కొడతారో? లేదో? చూద్దాం..
[youtube_video videoid=lBi8ocJHLuc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: