ఒకప్పుడు సినిమా చూడాలంటే ఇప్పుడున్నంత ఈజీగా ఉండేది కాదు. కొత్త సినిమా రిలీజైందంటే ఆ సినిమాకు వెళ్లడమే కష్టంగా ఉండేది…ఇక టీవీల్లోకైతే ఏ రెండు, మూడు సంవత్సరాలకో టెలికాస్ట్ అయ్యేది. టీవీలకు అతుక్కుపోయి మరీ చూసే వాళ్లు జనాలు కూడా. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టెక్నాలజీ పెరిగిపోవడంతో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం వల్ల ఒక్క సినిమాలు కాదు.. ఎన్ని సినిమాలైనా చూసుకునే అవకాశం కలిగింది. ఇక అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ ల పుణ్యమా అంటూ కొత్త సినిమాలు కూడా ఎంచక్కా ఇంట్లో ఉండే చూసేస్తున్నారు. వీటివల్ల డిజిటిల్ ప్రపంచం ఒక్కసారిగా పెద్దదైపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మారతున్న రోజులను బట్టి మన సినీ నటీ నటులు కూడా మారుతున్నారు. తాము రెగ్యులర్ గా చేసే సినిమాలతో పాటు డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతున్నారు. తమకు వచ్చిన అవకాశాలను ఏ మాత్రం వదులుకోకుండా నటించేస్తున్నారు. ఇప్పుడు తాజాగా నిత్యమీనన్ కూడా వెబ్ సీరిస్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తుంది. అమెజాన్ రూపొందిస్తున్న ‘బ్రీత్’ సీజన్ 2లో లీడ్ రోల్లో నిత్యామీనన్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్ 2 లో అభిషేక్ బచ్చన్ హీరోగా నటించనున్నారు.
ఇక దీని గురించి నిత్యా మాట్లాడుతూ.. ‘‘బ్రీత్’ నా తొలి డిజిటల్ షో. ఇలాంటి థ్రిల్లింగ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్లకు ఇలాంటి సిరీస్లు చాలా పర్ఫెక్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఎపిసోడ్ ఎపిసోడ్కి చాలా సమయం ఉంటుంది. ప్రతి పాత్రను లోతుగా ఆవిష్కరించవచ్చు. డిజిటల్ సిరీస్లో కంటెంట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు కూడా’’ అని తెలిపింది.
మొత్తానికి నిత్యా స్మార్ట్ అని మరోసారి నిరూపించింది. ఎందుకంటే..ఫ్యూచర్ లో డిజిటల్ మార్కెట్ కే ఎక్కువ వాల్యూ ఉంటుందని ముందే ఊహించిఉండొచ్చు. కాగా ప్రస్తుతం నిత్యా ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్ ఆధారంగా తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘మిషన్ మంగళ్’ సినిమాలో శాస్త్రవేత్తగా నటిస్తుండగా… తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘ఐరన్లేడీ’ సినిమాలో కూడా నటిస్తోంది. వీటితో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది.
[youtube_video videoid=xsTZWd1V_8M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: