మహి. వి రాఘవ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సంచలనం రేపుతోంది. అదేంటంటే… 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సంస్థలు అమెరికాలో సీటెల్లో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్ను వేలం వేశాయి. అక్కడ మునీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి 6,116 డాలర్లకు మొదటి టికెట్ను గెలుచుకున్నారట. అంటే మన కరెన్సీ ప్రకారం.. దీని ధర అక్షరాలా రూ. 4.37 లక్షలన్నమాట. అయితే $12 విలువ చేసే టికెట్ను అతనికి అందించి.. మిగతా డబ్బులను వైఎస్సార్ ఫౌండేషన్కు విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు.
కాగా 70ఎమ్ ఎమ్ బ్యానర్ పై శివ మేక సమర్పణ లో విజయ్ చిల్ల, శశిదేవ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, పోసాని, సుహాసిని, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కె సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=OuIJDxLeEBc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: