సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం `మహర్షి`. ఈ సినిమాతో కథానాయకుడిగా 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, `దిల్` రాజు, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో `అల్లరి` నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఉగాది సందర్భంగా ఏప్రిల్ 5న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం… విడుదల తేదిలో చిన్న మార్పు చోటుచేసుకుందని తెలుస్తోంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం… `మహర్షి` ఏప్రిల్ 26న తెరపైకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అయితే… దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాధారణ ఎన్నికల ప్రకటన వచ్చాకే… `మహర్షి` విడుదల తేదిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఏప్రిల్ ద్వితీయార్ధంలో వచ్చిన మహేష్ చిత్రాలు `పోకిరి`, `భరత్ అనే నేను` బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో… `మహర్షి` కూడా సెంటిమెంట్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=Gi5xB4ZlXNE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: