`విజయా వారి` సినిమాలంటే… కుటుంబ సమేతంగా చూడదగ్గ కమనీయ దృశ్యకావ్యాలని నాటి తెలుగు ప్రేక్షకుల మాట. ఇప్పటికీ ఈ సినిమాలు బుల్లితెరపై వినోదాన్ని పంచుతుంటాయి. ‘పాతాళభైరవి’, ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఈ సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన సినిమా ‘అప్పుచేసి పప్పుకూడు’. తమిళంలో విడుదలైన ‘కడన్ వాంగి కళ్యాణం’కు రీమేక్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. యన్.టి.రామారావు, సావిత్రి జంటగా ప్రముఖ దర్శకులు ఎల్.వి.ప్రసాద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో… జమున, జగ్గయ్య, ఎస్.వి.రంగారావు, రమణారెడ్డి, రేలంగి, గిరిజ, సూర్యకాంతం, ముక్కామల, అల్లు రామలింగయ్య, కస్తూరి శివరావు ఇతర ముఖ్యపాత్రలను పోషించారు. సాలూరి రాజేశ్వరరావు స్వరసారథ్యంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా ‘కాశీకి పోయాను రామాహరే’, ‘ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి’, ‘మూగవైన’ పాటలతో పాటు ‘అప్పుచేసి పప్పుకూడు’ టైటిల్ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. 1959 జనవరి 14న విడుదలైన ‘అప్పుచేసి పప్పుకూడు’… నేటితో 60 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: