జపాన్ లో తెలుగు సినిమాలకు మంచి డిమాండే ఉందన్న సంగతి ఇప్పటికే అర్దమైపోయింది. ఒకప్పుడు రజినీ సినిమాలకు మాత్రమే క్రేజ్ ఎక్కువగా ఉండేది కానీ.. ఆ తరువాత పలు తెలుగు సినిమాలు కూడా జపాన్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టినవే. రాజమౌళి సినిమాలైనా మగధీర, బాహుబలి సినిమాలకు జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక బాహుబలి సినిమా తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. పక్క దేశాల్లో కూడా ఈ బాహుబలికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే జపాన్ లోని తన అభిమానులకు ప్రభాస్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. న్యూఇయర్ సందర్భంగా గ్రీటింగ్ కార్డులపై ‘మీరంతా సంతోషంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొంటారని ఆశిస్తున్నాను’ అని రాసి పంపించారట. అది కూడా జపనీస్ భాషలో రాసి పంపించారట. గ్రీటింగ్ కార్డ్స్ తో పాటు…తాను కొత్తగా దిగిన ఫొటోలను కూడా పోస్ట్ చేశారట. మొత్తానికి ప్రభాస్ కూడా అభిమానుల మనసు ఎలా దోచుకోవాలో తెలుసుకున్నట్టున్నాడు.
కాగా ప్రభాస్ ప్రస్తుతం ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు చిత్రయూనిట్. ప్రభాస్ సరసన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా… ఇంకా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
[youtube_video videoid=3gQXWLW3xV4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: