తెలుగు సంప్రదాయాలకు పెద్ద పీట వేసి… కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను రూపొందిస్తుంటారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. అలా ఆయన తెరకెక్కించిన చిత్రాలలో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలచింది `నిన్నే పెళ్ళాడతా`. అంతేకాదు… 22 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా కింగ్ నాగార్జున కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్గా నిలచింది. ఆ తరువాత నాగ్, కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన `చంద్రలేఖ` మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. అనంతరం వేర్వేరు సినిమాలతో బిజీ అయిపోయిన ఈ ఇద్దరూ… అతి త్వరలో మరో సినిమా కోసం జట్టుకట్టనున్నారని ఫిల్మ్నగర్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే… `నక్షత్రం` తరువాత మరో సినిమాని పట్టాలెక్కించని కృష్ణవంశీ… ఆ మధ్య నూతన తారలతో గ్రామీణ నేపథ్యంలో ఓ చిత్రాన్ని తీయబోతున్నారని వార్తలు వచ్చాయి. అలాగే మరాఠీ చిత్రం `నట సామ్రాట్`ని ప్రకాశ్ రాజ్తో రీమేక్ చేయబోతున్నట్లు కూడా కథనాలు వినిపించాయి. అయితే… అనూహ్యంగా ఇప్పుడు నాగ్, కృష్ణవంశీ కాంబినేషన్ వెలుగులోకి వచ్చింది. కృష్ణవంశీ చెప్పిన ఓ స్టోరీ లైన్… నాగ్ను ఎంతగానో ఇంప్రెస్ చేసిందని… త్వరలోనే వీరిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతోందని టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=Svm_7gwuqXc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: